సంక్రాంతి తర్వాత సినిమాల విడుదలలకి సరైన సమయం కాదంటారు. ఇలాంటి తరుణంలో పెద్ద సినిమాల కంటే చిన్నహీరోల సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు విడుదలై దొరికినంత కలెక్షన్స్ దోచుకుంటుంటాయి. అందులో భాగంగానే ఈ వారం బాక్స్ ఆఫీసు పై ఐదు సినిమాలు దాడి చేయనున్నాయి. అన్నిటికంటే ముందుగా వీకెండ్ కి ఒకరోజు ముందే శివ హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్న ‘జగన్ నిర్దోషి’ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఇది కాకుండా విలక్షణ దర్శకుడు ముంబై దాడుల ఆధారంగా తెరకెక్కించిన ’26/11 ఇండియా పై దాడి’. ఈ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక రెండవ సినిమా కామెడీ హీరో సునీల్ నటిస్తున్న ‘Mr పెళ్ళికొడుకు’. ఇది హిందీలో హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ కి రీమేక్. మూడవ సినిమా విషయానికొస్తే ‘మనసారా’ సినిమా ద్వారా పరిచయమైన విక్రం హీరోగా రానున్న బాచిలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేస్’. వీటితో పాటు నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘నిత్య’ అనే డబ్బింగ్ సినిమా కూడా ఈ వారం విడుదల కానుంది. ఈ నాలుగు సినిమాలు మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఐదు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీసు విజేతగా నిలుస్తుందో చోదాలి. ఫ్రెండ్స్ మీరు ఏ సినిమా బాక్స్ ఆఫీసు విజేతగా నిలుస్తుందనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలపండి..
Post a Comment